సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ సందర్భంగా 32 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7 నుంచి 27 వరకు రాకపోకలు సాగిస్తాయన్నారు. సికింద్రాబాద్-బ్రహ్మపూర్, బ్రహ్మపూర్-వికారాబాద్, విశాఖపట్నం-కర్నూల్ సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-కాకినాడ టౌన్, నర్సాపూర్-సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయన్నారు. అదేవిధంగా హిసర్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్యలో రెండు ప్రత్యేక రైళ్లను పొడిగించారు. ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 2 వరకు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో రైళ్ల కార్యకలాపాల భద్రతపై వివరణాత్మక సమీక్ష సమావేశాన్ని జోనల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ నిర్వహించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.