చిక్కడపల్లి : పేద ప్రజల వైద్య ఆరోగ్య సేవలను అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్) ఎంతో తోడ్పాటును అందిస్తోందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం గాంధీనగర్ డివిజన్లోని అశోక్నగర్లోని అదే ప్రాంతానికి చెందిన వి.శిరీషకు రూ. 60వేలు, ఎం.జి. శంకర్కు రూ. 22 వేలు,గాంధీనగర్ కు చెందిన జవేరియాకు రూ.14వేలు చెక్కులను అదజేశారు.
అదే విధంగా భోలక్పూర్కు చెందిన జె.నందిని చికిత్స కోసం రూ.2లక్షలకు సంబంధించిన ఎల్ఓసీ పత్రాన్ని లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తులు చేసుకున్న అర్హులందరికీ సీఎంఆర్ఎఫ్ అందించడం జరుగుతుందని తెలిపారు.
మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువజన నాయకుడు ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.