హైదరాబాద్ : ర్యాష్ డ్రైవింగ్(Rash driving) కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారడికి కోర్టు రిమాండ్ (Sahil remanded) విధించింది. షకీల్ కుమారుడు సాహిల్కు 14 రోజుల జ్యుడీషయల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు సాహిల్ను చంచల్గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు.
కాగా, హైదరాబాద్లోని ప్రజాభవన్ (ప్రగతి భవన్) ఎదుట ఉన్న బ్యారికేడ్లను ఇటీవల సాహిల్ తన వాహనంతో ఢీకొట్టినట్టు పోలీసులు కేసు నమోదు చేయడంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. సాహిల్ తప్పించుకొని దుబాయ్కి పారిపోయాడు. దీంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, ఎట్టకేలకు సాహిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి భారత్ తిరిగి వస్తున్న సాహిల్ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.