తెలుగుయూనివర్సిటీ, జూన్ 8: సంగీతం, సాహిత్యం, సినీరంగానికి ఆర్వీ.రమణమూర్తి చేసిన కృషి అనిర్వచనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. కళావేదిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో బుధవారం పలువురు సాహితీవేత్తలు,కళాకారులకు ఆర్వీఆర్ ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు.
ఆచార్యదేవోభవ పురస్కారాలను విబివి లక్ష్మి, ఆనంద లక్ష్మి, నృత్య గురువు సుష్మప్రీతి, భారతి ధర్భ, కళ్యాణిమాదినేనిలకు అందజేశారు. ప్రముఖ సాహితీవేత్త బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్.వేణుగోపాలచారి, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ అసామాన్య మైన రమణమూర్తి గొప్ప వ్యక్తి అని కీర్తించారు. నటులు సుమన్, సంఘసేవకులు రవికాంత్మ్రణ, ఎం.వెంకటేశ్వరరావు, అప్పారావు, కళావేదిక కార్యదర్శి భువన తదితరులు పాల్గొన్నారు.