సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్ పాస్ల జారీలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సోమవారం సాంకేతిక ఇబ్బందులు ఎదురవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్టూడెంట్ బస్ పాస్లు జారీ చేయలేదు. వారం రోజుల నుంచి సర్వర్ డౌన్ సమస్యలు ఉన్నాయని, ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు పనిచేయదో తెలియడం లేదని సిబ్బంది వాపోయారు.
రేతిఫైల్లో సర్వర్ పనిచేయకపోవడంతో బస్ పాస్ కౌంటర్లు ఖాళీ గా దర్శనమిచ్చాయి. విద్యా సంస్థలు ప్రారంభమవ్వడంతో బస్ పాస్ల కోసం విద్యార్థులు అధిక సంఖ్యలో వస్తుంటారు. సాంకేతిక సమస్యలు వస్తుండటంతో వాళ్లంతా ఆర్టీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.