హైదరాబాద్: అసలే ఎన్నికల సీజన్, అందులో రంజాన్ మాసం కావడంతో ఇఫ్తార్ విందులతో (Iftar Party) రాజకీయ నాయకులు సందడి చేస్తున్నారు. అయితే హైదరాబాద్లోని పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ ఇఫ్తార్ పార్టీలో సందట్లో సడేమియా అన్నట్లుగా దొంగ హల్చల్ చేశాడు. అంతా విందును ఎంజాయ్ చేస్తుండగా ఆ చోరుడు తన పని తాను కానించాడు. చిన్నగా అక్కడి నుంచి ఉడాయిస్తుండగా గుర్తించిన కొందరు అతడిని పట్టుకున్నారు. దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్లోని పాతబస్తీలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, రంజిత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, అనిల్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అంతా హడావిడిగా ఉండగా వీఐపీలతోపాటు ఆ దొంగ కూడా స్టేజ్ ఎక్కాడు. వారి జేబులకు కన్నం వేశాడు. మొత్తం 8 ఫోన్లతోపాటు రూ.2 లక్షల నగదు కొట్టేశాడు. ఇక తనకేమీ తెలియదన్నట్లుగా అక్కడినుంచి జారుకుండుండగా కొంతమంది కార్యకర్తలు చూసి అతడిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.
ఇఫ్తార్ విందులో జేబుదొంగ హల్ చల్
ఇఫ్తార్ విందులో హడావిడి ఉండగా VIPలతో పాటు స్టేజ్ ఎక్కిన కేటుగాడు, VIPల జేబులకే కన్నం వేసాడు. 8 ఫోన్లతో పాటు 2 లక్షల నగదు కొట్టేసి జారుకుండుండగా కొంతమంది కార్యకర్తలు చూసి పట్టుకున్నారు.
ఈ ఇఫ్తార్ విందుకు ఎంపీలు అసుద్దిన్ ఓవైసీ, రంజిత్ రెడ్డి,… pic.twitter.com/P9w6y6a41O
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2024