సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : హజ్ యాత్రికుల పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియకు సికింద్రాబాద్ ఆర్పీవో పరిధిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి జే. స్నేహజ తెలిపారు. ఈ నెల 13, 15, 18న ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
హజ్ యాత్ర చేయాలనుకునే వారు తప్పనిసరిగా తమ పాస్పోర్ట్ గడువు 2025 జనవరి 31 వరకు ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ఆమోదం తెలిపిన పాస్పోర్ట్ దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని వివరించారు.