శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5: రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోల్కొ ండ ఖాజీగల్లీకి చెందిన కారుడ్రైవర్ సయ్యద్ సాహి(20), యూసుఫ్గూడ హెచ్ఎఫ్నగర్కు చెందిన హోం థియేటర్ పనులు నిర్వహించే సయ్యద్ తబ్రెస్ (20) స్నేహితులు. జల్సాలకు అలవాటుపడిన వారు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గోల్కొండ, సైఫాబాద్, రాజేంద్రనగర్, రాయదుర్గం పోలీస్స్టేషన్ల పరిధిలో నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడ్డారు. బుధవారం రాయదుర్గంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన సాహి, తబ్రెస్లను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులిద్దరిని రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.