బాధ్యతల స్వీకరణ సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా రోనాల్డ్ రోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా పని చేసిన లోకేశ్కుమార్ నుంచి రోనాల్డ్రోస్ బాధ్యతలు తీసుకున్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా పని చేసిన రోనాల్డ్రోస్ను రెండు రోజుల క్రితం ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్గా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్రోస్ను, బదిలీపై వెళ్లిన లోకేష్కుమార్ను ఆయా విభాగాల హెచ్వోడీలు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాక రోనాల్డ్ రోస్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త కమిషనర్ను కలిసిన వారిలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, ఈఎన్సీ జియావుద్దీన్, అడిషనల్ కమిషనర్లు ప్రియాంక అలా, వి. కృష్ణ, సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెనడీ, హెచ్ఆర్డీసీఎల్ సీఈ సరోజినీ దేవి, ప్రాజెక్టు సీఈ దేవానంద్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, హౌజింగ్ ఓఎస్డీ సురేశ్బాబు, సీఎంఅండ్హెచ్వో డాక్టర్ పద్మజ, సీపీఆర్వో మహమ్మద్ ముర్తుజా, సెక్రటరీ లక్ష్మి, పీడీ సౌజన్య, జాయింట్ కమిషనర్ శశిరేఖ వెంకట్రెడ్డి, సంధ్య, ఎస్ఈలు వెంకటరమణ, విద్యాసాగర్, రవీందర్ రాజు, రత్నాకర్, అశోక్రెడ్డి, చిన్నారెడ్డి, శంకర్, పీఆర్వో పద్మ తదితరులు ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్గా నూతనంగా నియమితులైన రోనాల్డ్ రోస్ బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్కు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు.
– సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ )