మాదాపూర్ : సీసీ కెమెరాలు నేర నియంత్రణలో కీలకపాత్ర పోశిస్తున్నాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (Mla Gandhi ) అన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీలో గురువారం రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల( CC Cameras) ను ఎస్సై సత్యం, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు అస్టెస్టాస్ కాలనీ వాసులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలను నేరాలను(Crimes) అరికట్టడంలో కీలకపాత్ర పోశిస్తాయని అన్నారు. కాలనీలో నేరాలను నియంత్రించేందుకు అవసరమైతే తన వంతు సహయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 సీసీ కెమెరాలతో సమానమని అన్నారు. నేరాలను అదుపు చేసుకునేందుకు కాలనీవాసులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు తాను ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి రూ. కోటి కేటాయించానని వెల్లడించారు. మహిళల భద్రత(Women safety) , ప్రజల రక్షణ, దొంగతనాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కూకట్పల్లి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. అస్బెస్టాస్ కాలనీ అధ్యక్షుడు అస్బెస్టాస్ కాలనీ అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.