బండ్లగూడ, అక్టోబర్ 3: బస్స్టాప్లో వేచి ఉన్న మహిళ మెడలోనుంచి రెండు తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకొని పారిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రారెడ్డినగర్కు చెందిన డి.సత్యవతి రాజేంద్రనగర్ వెళ్లేందుకు బస్స్టాప్లో బస్సు కోసం వేచి ఉంది.
గుర్తు తెలియని వ్యక్తి అమె మెడలోనుంచి రెండు తులాల పుస్తెలతాడును తెంచుకొని పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం గోడ దూకి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.