జియాగూడ, జూలై 28: మూసీ పరివాహక ప్రాంతమైన జియాగూడలోని వందఫీట్ల బైపాస్ రోడ్డులో వరద ఉధృతి తగ్గడంతో బైపాస్ రోడ్డు చెత్త చెదారం, మట్టి కూప్పలతో నిండి పోయింది. గురువారం పురానాపూల్ వంతెన కింద వరద ప్రవాహం తగ్గడంతో రహదారిలో చిక్కుకున్న వాహనాలు బయటపడ్డాయి. వందపీట్ల బైపాస్ రోడ్డులోని పిలిమండలం శివాలయం, హనుమాన్ ఆలయం, శివాలయ ఘాట్, ఇచ్చాపూరి బోలేనాథ్ దేవాలయాలు పరిసరా ప్రాంతాలు చెత్త చెదారంతో నిండిపోయాయి.
త్వరలోనే ప్రజలకు బైపాస్ రోడ్డును అందుబాటులోకి తీసుకువస్తామని జీహెచ్ఎంసీ డీప్యూటీ మున్సిపల్ కమిషనర్ డి. నర్సింహ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందఫీట్ల బైపాస్ రోడ్డు మూసీనదికి అనుకోని ఉండడంతో వరదనీరు చేరుతోందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకూండ త్వరలోనే రోడ్డు పరిశుభ్రత పనులు ప్రారంభిస్తామన్నారు. బురద మయంగా రోడ్డు ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండ ముందస్తు చర్యలో భాగంగా రోడ్డు మూసివేశామని వెల్లడించారు.