బంజారాహిల్స్,జనవరి 5: వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పంజాగుట్ట, నాగార్జునసర్కిల్ తదితర ప్రాంతాల్లో మురుగు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.1.92 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. డివిజన్ పరిధిలోని పంజాగుట్ట ప్రాంతంలో రూ.27లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్లైన్ పనులను గురువారం ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని సింగాడకుంటలో రూ.47లక్షలతో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రోడ్ల నిర్మాణంతో పాటు మురుగు సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లో 27లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం కానుందన్నారు. నాగార్జున సర్కిల్ నుంచి పంజాగుట్ట వెళ్లే రోడ్డులో మురుగు సమస్య తీవ్రంగా ఉన్నాయని, 450 డయా పైపులైన్లు వేయాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు రూపొందించారన్నారు. ఈ మేరకు తాను సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేయాలని ఆదేశించారని వెల్లడించారు. ఈ మేరకు రూ.1.92కోట్ల నిధులు కొత్తలైన్ కోసం మంజూరు చేసినట్లు ఎండీ దాన కిశోర్ సమాచారం ఇచ్చారని దానం నాగేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ విజయ్కుమార్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్,ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్, అక్బర్, సుధీర్ పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణ పనులపై సమీక్ష
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14 ప్రధాన రహదారిలో రూ.27లక్షలతో కొత్తగా రోడ్డు నిర్మాణపనులను త్వరలో ప్రారంభించనున్నారు. డీఏవీ స్కూల్ నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం దాకా కొత్తగా రోడ్డు వేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇక్కడ రోడ్డుపనులు ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు, జీహెచ్ఎంసీ ఈఈ విజయ్కుమార్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో పాటు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రద్దీగా ఉండే ఈ రోడ్డులో రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించి ఆటంకాలు లేకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.