సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా తాగు నీటి సరఫరా స్కీమ్ ఫేజ్-1లో కలబ్గూర్ నుంచి లింగంపల్లి వరకు పీఎస్సీ, ఎంఎస్ పైపులైన్కు ఏర్పడ్డ లీకేజీలకు 5 ప్రాంతాల్లో మరమ్మత్తులు పూర్తి అయ్యాయి. కందివాగు, ఇస్నాపూర్, బీరంగూడ, అశోక్నగర్, బీహెచ్ఈఎల్ మెయిన్గేట్, హుడా కాలనీ, చందానగర్ ప్రాంతాల్లో మరమ్మత్తులు పూర్తి అయినట్లు జలమండలి అధికారులు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కలబ్గూర్ నుంచి నీటిని సరఫరా చేయడం ప్రారంభించినట్లు, నీటి సరఫరా పునరుద్ధరణ జరిగినట్లు చెప్పారు.