సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్లోని బాప్టిస్టు చర్చి పునరుద్ధరణకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. నగరంలో చారిత్రాత్మక కట్టడంగా ఉన్న సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చికి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణ, పరిరక్షణ నేపథ్యంలో భాగంగా బాప్టిస్టు చర్చి కోసం రూ.1.35 కోట్లను వెచ్చించేందుకు హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు మంగళవారం హెచ్ఎండీఏ అధికారులు టెండర్లు పిలిచారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.