హైదర్షాకోట్ డివిజన్ పరిధిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి మేనేజర్ నరేశ్కు వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం స్థానిక బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేకపోవడం.. ఫోన్లో కూడా స్పందించకపోవడంతో నరేశ్ కూర్చునే కుర్చికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ పీరం చెరువు, బైరాగిగూడ, గంధంగూడ, హైదర్షాకోట్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంచినీటి ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలను పట్టించుకోకుండా స్థానిక జలమండలి మేనేజర్ నరేశ్ నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల కోళ్ల నాగరాజు మండి పడ్డారు.
– బండ్లగూడ