మైలార్దేవ్పల్లి : ఆధ్యాత్మికతో కూడిన ప్రతి పనికి తన సహాయ సహాకారాలు ఉంటాయని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే నివాసంలో ఆపద్భాంధవ సేవాసమితి కాటేదాన్ సభ్యులు శ్రీసద్గురు సాయిబాబా మందిర నిర్మాణానికి చేయూతనివ్వాలని వినతి పత్రం అందజేశారు.
గణేష్నగర్లో అనేక సంవత్సరాలుగా సాయిబాబ మందిరం నిర్మించాలనుకుంటున్నట్లు వారు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ..ప్రజలలో భక్తి భావం పెరగడానికి దేవాలయాలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. సాయి మందిరానికి తన వంతు చేయూతనందిస్తానని హమీ ఇచ్చారని ఆపద్బాంధవ సేవాసమితి అధ్యక్షుడు కొప్పుల రవిందర్గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రేమ్రాజ్ ,ఐలేష్ ,డాక్టర్ కె భార్గవ, జీ. స్వరూపరాణి, వి సురేష్బాబు, ప్రహ్లాద్ , విఠల్ మనోజ్ తేష్నివాల్ ,రాజు తదితరులు ఉన్నారు.