జూబ్లీహిల్స్, జూన్ 20 : జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్పై దాడికి యత్నించిన రహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్కు వినతి పత్రం సమర్పించారు. యూసుఫ్గూడలోని సర్కిల్ కార్యాలయంలో విధులలో వున్నఏఎంసీ బాలరాజ్పై కార్పొరేటర్, అతని అనుచరులు దాడికి యత్నించిన ఘటనలో ఇప్పటికే స్థానిక మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కాగా శాఖ పరమైన విచారణకు గాను ఇప్పటికే జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడేకు వినతి పత్రం ఇచ్చిన ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు జీహెచ్ఎంసీ కమిషనర్కు కూడా వినతి పత్రం సమర్పించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులపై, అధికారులపై దాడులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఏఎంసీ బాల్ రాజ్ కోరారు.