మణికొండ : రైతులపై కేంద్ర ప్రభుత్వం సవతిప్రేమను చూపుతూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్నారని ప్రజలంతా ఐఖ్యతను చాటి కుట్రలను తిప్పికొట్టాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్.నర్సింహ్మ, నార్సింగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్యాదవ్లు పేర్కొన్నారు.
రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధిష్టాన పిలుపుమేరకు శుక్రవారం గండిపేట తహశీల్దారు కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేసి నిరసించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీకి, కేంద్ర బీజేపీ పెద్దలకు పొంతనలేకుండా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ఏడేళ్ల కాలంలో రాష్ట్రానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ది కోసం టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక అనవసర ప్రకటనలతో ప్రజలను సందిగ్దంలో పడేసే యత్నం చేస్తున్నారని ప్రజలంతా అసలు నిజాలను తెలుసుకోవాలన్నారు. అనంతరం తహశీల్దారు కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి, నార్సింగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్యాదవ్, కార్పొరేటర్లు సురేశ్గౌడ్, కౌన్సిలర్లు శివారెడ్డి, పత్తి శ్రీకాంత్, కో-ఆప్షన్ సభ్యులు ప్రశాంత్యాదవ్, మలాకీరత్నం, మహేశ్వర్రెడ్డి,మణికొండ, బండ్లగూడ మున్సిపాలిటీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.