రియల్ ఎస్టేట్ రంగంతో జీహెచ్ఎంసీ పరిధిలో పాటు యాదాద్రి, భువనగిరితో పాటు నగర నలుమూలలూ.. వెంచర్లు విస్తరిస్తున్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి. ఆయా ప్రాంతాలు కమర్షియల్ ప్రాంతాలుగా మారుతున్నాయి. దీంతో వెంచర్ల వారీగా, అపార్టుమెంట్ల వారీగా వ్యాపారం చేసుకోవడానికి ఆయా వెంచర్ యాజమాన్యా లు కనీసం 20 మందితో మార్కెటింగ్ టీమ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగానికి ఎంపికైన యువతకు ఫిక్స్డ్ జీతం ఇస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మే డ్చల్ మల్కాజిగిరి జిల్లాలతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా మార్కెట్ చేస్తున్నారు. స్విగ్గీ, డెలివరీ బాయ్ వంటి ఉద్యోగాలను పక్కన పెట్టి.. రియల్ ఉద్యోగాల వైపు యువత ఆసక్తి చూపుతుంది. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరికీ ఉపాధి లభించడం ఇందుకు కారణం. పార్టు టైం ఉద్యోగం పేరుతో ఎంతో మంది యువత కూడా ఈ రం గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు.
బీటెక్, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన యువత ఉద్యోగం కోసం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకుంటుంది. ముఖ్యంగా అన్లాక్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి నిర్ణయాల వల్ల రియల్ రంగం మంచి ఊపుమీద ఉంది. అందు లో భాగంగా ఈ ఏడాది మార్చి నెలలో ఒక్క రంగారెడ్డి జిల్లాలో రూ.276 కోట్ల వరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ల వల్ల ఆదాయం వచ్చింది. అదే క్రమంలో మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లాలో కూడా రియల్ జోరు కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు కూడా నగర చుట్టు పక్కల ఒక ప్లాట్ తీసుకుంటే బాగుంటుందని భావించి తీసుకుంటున్నారు.. డబ్బులు ఉన్నవారు పెట్టుబడి కింద ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అందుకోసం వెంచర్లవారు.. మార్కెటింగ్ బృందం సేవలు ఉపయోగించుకుంటున్నారు.. వీరైతే అన్ని రకాల అనుమానాలు, అనుమతులు గురించి వివరిస్తారని భావించి ఉద్యోగం కల్పిస్తున్నా రు. ఇక ముందు రియల్ రంగంలో యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయని రియల్ రంగానికి చెందిన పులువురు తెలిపారు.