సైదాబాద్, ఫిబ్రవరి 12: జైళ్ల శాఖలో ఉద్యోగాలు సవాళ్లతో కూడుకున్నవని హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్త (Ravi Gupta) అన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని చెప్పారు. చంచల్గూడలోని సికా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ జైళ్ల శాఖ 7వ రాష్ట్ర స్థాయి వార్షిక స్పోర్ట్స్మీట్ 2025ను హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్త, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఈ సంద్భంగా రవి గుప్త మాట్లాడుతూ స్పోర్స్ మీట్ల ద్వారా సిబ్బందిలో శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు సిబ్బంది మధ్య స్నేహ సంబంధాలకు ఎంతగానో దోహద పడుతుందని చెప్పారు. జైలు ఉద్యోగమనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు.
అంతకు ముందు స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు రాజేశ్, డీఐజీలు మురళి బాబు, డాక్టర్ శ్రీనివాస్, సంపత్, చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ ఎన్.శివకుమార్ గౌడ్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.