ఐదేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు జరిమానాను కోర్టు విధించింది. మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రణవీర్రెడ్డి కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన తుక్రత్సింగ్ (39) మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని సిబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంటూ కూలీ పనులు చేస్తుంటాడు.. గత సంవత్సరం అక్టోబర్ 7న తన గది పక్కనే ఉంటున్న ఐదేండ్ల బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని రూంకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గోషామహల్ ఏసీపీ నరేందర్రెడ్డి కోర్టులో కేసు చార్జిషీట్ దాఖలు చేశారు. గురువారం న్యాయమూర్తి సునీత కుంచెల నిందితుడికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఘటన జరిగిన ఆరు నెలల్లోపు నిందితుడికి శిక్ష పడటంతో పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ నరేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్ రణవీర్రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ షేక్ ఇస్మాయిల్, ఎస్ఐ శివానందం, రైటర్ నరేశ్ను అభినందించారు.