కవాడిగూడ, సెప్టెంబర్ 1: భారతీయ సంస్కృతీసంప్రదాయాల విశిష్టతను యావత్తు ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని స్వామి వివేకానంద హ్యూమన్ ఎక్స్లెన్సీ డైరెక్టర్ స్వామి బోధమయానంద అన్నారు. బుధవారం లోయర్ ట్యాంక్బండ్లోని దోమలగూడలోని స్వామి వివేకానంద హ్యూమన్ ఎక్స్లెన్సీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి బోధమయానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలు, ఆలోచనా విధానాలు, బోధనలను నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉన్నదని అన్నారు. రామకృష్ణ మఠం 33 విభాగాల్లో శిక్షణ ఇస్తున్నదని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.హ్యూమన్ ఎక్స్లెన్సీ ఏర్పాటు చేసిన 22 ఏండ్లలో ఇప్పటివరకు 19లక్షల 69 వేల మందికి సమాజంలో అన్ని వర్గాల ప్రజలు శిక్షణ పొందారని అన్నారు. చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగం చేసి 128 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ నెల 11న రామకృష్ణ మఠంలో 128 వార్షికోత్సం ఉపన్యాస కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో వళ్లీశ్వర్, నారాయణ రావు, క్రాంతి దేవ్తో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.