హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్(Vigilance DG Rajeev Ratan) అంత్యక్రియలు( Cremation) బుధవారం రాయదుర్గం ప్రస్థానంలో(Rayadurgam Prasthanam) పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో రాజీవ్ రతన్ అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించింది. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) హాజరై నివాళులు అర్పించారు.
కాగా, రాజీవ్ రతన్ గుండెపోటుతో (Heart attack) మంగళవారం కన్నుమూశారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొన సాగుతున్నారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి(Died) చెందారు.