సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : రాజేంద్రనగర్ బీఎస్సీ అగ్రికల్చర్ 1968 పూర్వ విద్యార్థుల సమ్మేళనం జూబ్లీహిల్స్ కల్చరల్ సెంటర్ (క్లబ్)లో మంగళవారం జరిగింది. 55 ఏండ్ల తర్వాత కలవడంతో మిత్రుల ఆనందానికి అవధుల్లేవని తెలిపారు. విశ్రాంత వీసీ, కలెక్టర్, ప్రొఫెసర్లు, అడిషనల్ డైరెక్టర్గా పరిచయం చేసుకుంటూ ఉత్సహంగా గడిపారు.
ఈ సందర్భంగా తమ నుంచి శాశ్వతంగా దూరమైన మిత్రులు 31 మందిని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వీసీ డాక్టర్ శిఖామణి, ఎన్.సుబ్బారావు, ఎస్ జనార్దన్రావు, విశ్రాంత ఐఏఎస్ డీవీ రాయుడు, డాక్టర్ ఎంవీ రావు, బి.మోహన్రెడ్డి, ఆర్.బాలబ్రహ్మచారి, జైకృష్ణ, సుధీంద్ర, నర్సింహారావు, సతీశ్బాబు, ఎం.రాంరెడ్డి, సుదర్శన్రెడ్డి, టి.మోహన్రావు, వెంకట్త్న్రం నాయుడు తదితరులు పాల్గొన్నారు.