Prakash Goud | సీఎం రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన.. దాదాపు అరగంట పాటు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. దీంతో ప్రకాశ్ గౌడ్ పార్టీ మారబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రకాశ్ గౌడ్.. తాను కాంగ్రెస్లో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిని కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ప్రకాశ్ గౌడ్ తెలిపారు. తన నియోజకవర్గంలోని భూసమస్యలను పరిష్కరించాలని కోరేందుకు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. తన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.