సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తేతెలంగాణ): ఉపరితలద్రోణికి తోడు రుతుపవనాల ప్రభావంతో శనివారం రాత్రి నగరంలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది.
రాగల 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. గరిష్ఠం 36 డిగ్రీలు, కనిష్ఠం 26.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.