సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్(జేసీఐ) నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ’ అఫ్రూవల్ను పొందినట్లు రెయిన్బో చిల్ట్రన్స్ హాస్పిటల్, బర్త్ రైట్ బై రెయిన్ బో వెల్లడించింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో అంకితభావాన్ని గుర్తించి ఈ అఫ్రూవల్ ఇచ్చినట్లు తెలిపింది. ఐదు రోజులపాటు హాస్పిటల్ కార్యకలాపాలు, క్లినికల్ ప్రొటోకాల్స్, ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు, రోగి, ఉద్యోగుల భద్రత వంటి అనేక ప్రమాణాలతో కూడిన 13 అధ్యయనాలు, 1200 అంశాల చెక్లిస్టును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నాణ్యతపరంగా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉన్నందున జేసీఐ ఈ అక్రిడిటేషన్ను ప్రదానం చేసిందని చిల్డ్రన్స్ హాస్పిటల్, బర్త్రైట్ బై రెయిన్బో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కంచర్ల తెలిపారు.
ఇంతకుముందు కొండాపూర్లోని బర్త్రైట్ ఫెర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్కు జేసీఐ గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేశ్ కుమార్ చిర్ల, బర్త్ రైట్ బై రెయిన్ బో హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతి రెడ్డి, గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్, రెయిన్బో హాస్పిటల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఈవో సంజీవ్ సుకుమారన్లు మాట్లాడుతూ… రోగులకు అందించే సేవల్లో నాణ్యత, భద్రతలో ఉన్నత ప్రమాణాలను దేశ వ్యాప్తంగా 6 నగరాల్లో ఉన్న బ్రాంచ్లలో అందిస్తున్నట్లు తెలిపారు. జేసీఐ అక్రిడిటేషన్ ఆసుపత్రి పనితీరులో ఓ మైలురాయిని సూచిస్తుందని వారు పేర్కొన్నారు.