హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ వారం రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం వరకు హైదరాబాద్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం హైదరాబాద్లో అత్యధికంగా 38.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాబోయే రెండు రోజుల్లో నగరంలో 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 39 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నది. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 42.7, కామారెడ్డి జిల్లాలో 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అడ్డగుట్టలో 38.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.