హైదరాబాద్: హైదరాబాద్లో వర్షం (Rain) కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి వాన పడుతున్నది. కూకట్పల్లి, మూసాపేట, అమీర్పేట, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్పేటబంజారాహిల్స్, బంజారాహిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్పేట, దిల్సుఖ్నగర్, హయత్నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షం కురుస్తుండటంతో అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
అక్టోబర్లోనూ వర్షాలు
నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ చివరి వరకూ కొనసాగే అవకాశం ఉండటంతో అక్టోబర్లోనూ వర్షాలు కురి సే అవకాశముందని భారత వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సెప్టెంబర్, అక్టోబర్లో రుతుపవనాల వర్షపాతం లా నినా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్టు ఐఎండీ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల తిరోగమనంలో లా నినా అభివృద్ధి చెందితే.. అది ముగియడానికి చాలా సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. సెప్టెంబరు 3-4 వారాల్లో, అక్టోబర్ ప్రా రంభంలో భారీ వర్షాలు కురిస్తే, అప్పటికే చేతికొచ్చే పంటలకు, విత్తిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని ఫిలిప్ క్యాపిటల్ ఇండియాలో కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అశ్విని బన్సోద్ మీడియాకు తెలిపారు. వర్షాలు, వరదలతో ఏర్పడే పంటనష్టం కారణంగా ఆహార ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని అంచనా వేస్తున్నారు.