సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. నగరంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 32.6, కనిష్ఠం 24.0 డిగ్రీలు, గాలిలో తేమ 50శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.