సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : దక్షిణ శ్రీలంక నుంచి ఏర్పడిన ద్రోణి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మీదుగా కొనసాగుతుండడంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 34.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20.0డిగ్రీలు, గాలిలో తేమ 22శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.