చర్లపల్లి, మార్చి 31 : క్రైస్తవుల(Christians) సంక్షేమానికి కృషి చేస్తానని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) పేర్కొన్నారు. ఈసీఐఎల్ కమలానగర్లోని ఫస్ట్ సీఎస్ఈ హోలో క్రాస్ చర్చి పాస్టర్ రాహుల్ పాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్టర్(Easter celebration) వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు పునరుజ్జీవనానికి గుర్తు మరణంపై ఏసు సాధించిన విజయానికి ప్రతిక అన్నారు.
ఏసయ్య దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆక్షాంక్షించారు. క్రైస్తవుల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం నిర్వహించిన ప్రారక్థనలలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.