సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 556 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. 110 మంది వాహనదారులను న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
వీరిలో ఒకరికి మూడు రోజుల సామాజిక సేవ శిక్ష విధించగా, మిగతా వారికి జరిమానాలు విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పిందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతున్న సమయంలో సామాన్య ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.