నేరేడ్మెట్, సెప్టెంబర్ 7 : గణపతి నవరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహిద్దామని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. ఈ మేరకు గురువారం సఫిల్గూడ చెరువు వద్ద జరగనున్న నిమజ్జనం ఏర్పాట్లను గురువారం మున్సిపల్, రెవెన్యూ, పోలీ సు, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సీపీ పరిశీలించా రు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ..ఎలాంటి అ వాంచనీయ ఘటనలు జరగకుండా ప్రజలు ప్రశాంత వా తావరణంలో నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవాలని సూ చించారు. అన్ని ప్రాంతాల్లో జరిగే గణపతి నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతామని తెలిపారు.
నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన నిమజ్జన పాండ్లను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, నీటిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కోరారు, నిమజ్జనం కోసం చెరువు వద్ద క్రేన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని , జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, శానిటేషన్, మెడికల్ అండ్ హెల్త్ తదితర డిపార్టుమెంట్లతో కలిసి సమన్వయంతో నిమజ్జనాన్ని పూర్తి చే యాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ను నియంత్రించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నిమజ్జనానికి వచ్చే భక్తులతో సిబ్బంది, పోలీసులు మర్యాదపూర్వకంగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకట రమణ, కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి, ఏసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్రావు, నేరేడ్మెట్ సీఐ నాగరాజు, ఎస్సైలు చంద్రశేఖర్, సైదులు, రమేశ్ పాల్గొన్నారు.