ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు
మరిన్ని ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్
12-14 ఏండ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభం
దుండిగల్/కుత్బుల్లాపూర్, మార్చి 16 : తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించి.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్, షాపూర్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో 12 నుంచి 14 ఏండ్ల వయస్సున్న పిల్లలకు కరోనా టీకాను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం.. కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో అదనంగా మరిన్ని ఆసుపత్రుల నిర్మాణం జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దన్నా రు. కరోనా విపత్కర సమయంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అందిం చిన సేవలు మరువలేనివన్నారు. అనంతరం ‘జాతీయ టీకా’ దినోత్సవం సం దర్భంగా ఉత్తమ సేవలు అందించిన పలువురు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అదనపు వైద్యాధి కారి డాక్టర్ ఆనంద్, డాక్టర్ నవనీత, డాక్టర్ సంధ్యారాణి, డిప్యూటీ డెమో వేణుగోపాల్రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైద్యసిబ్బందితో పాటు స్థానిక పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వేణుమాధవి ఆధ్వర్యంలో 12 నుంచి 14 ఏండ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిం చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, టీఆర్ఎస్ కేఎం గౌరీశ్, పార్టీ శ్రేణులు సత్తిరెడ్డి, భాష, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 12నుంచి14 ఏండ్ల బాలబాలికలకు కొవిడ్-19 టీకా కార్యక్రమాన్ని దుండిగల్ పురపాలక సంఘం కమిషనర్ భోగీశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించిన ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, ఇతర సిబ్బందిని సత్కరించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా.నిర్మల తదితరులు పాల్గొన్నారు.