శంషాబాద్ రూరల్, ఆగస్టు 25 : శంషాబాద్ మండలంలోని నర్కూడ అమ్మపల్లి (సీతారామచంద్రస్వామి) దేవాలయాన్ని బుధవారం సాయంత్రం ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు ఆలయం విశిష్టతను, మినీ భద్రాచలంగా పిలువబడే ఈ దేవాలయంలో నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. హైదరాబాద్ సమీపంలో చారిత్రాత్మక దేవాలయం ఉన్నట్లు తెలియడంతోనే స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చినట్లు ఆమె తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.