మాదాపూర్ : రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతు ముందుకు సాగుతున్నారని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ. 1.20 కోట్లతో కొండాపూర్ కిమ్స్ హస్పిటల్ నుండి సూర్య టవర్స్ వరకు నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, జలమండలి జనరల్ జనరల్ మేనేజర్ రాజశేఖర్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం శంఖుస్థాన చేశారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ … ఎన్నో ఏండ్ల నుండి తీరని సమస్య నేటితో తీరనుండటంతో సంతోషం వ్యక్తం చేశారు. యూజీడి నిర్మాణ పనులను తక్షణమే చేపట్టి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ రాజశేఖర్, డిజిఎం నారాయణ, మేనేజర్ నివర్తి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, హఫీజ్పేట్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, నాయకులు వెంకటేష్ గౌడ్, వజీర్ తదితరులు పాల్గొన్నారు.