కుత్బుల్లాపూర్, మే16 : విద్యారంగాభివృద్ధికి సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్రాజు అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత, ప్రైమరీ పాఠశాలలలో ‘మన బస్తీ-మన ఊరు’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన రూ.77 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు మన బస్తీ-మన ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్యాదవ్, కొంపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, కమిషనర్ జి.రఘు, మాజీ ఎంపీపీ సన్న కవిత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రెడ్డి, శకుంతల, కౌన్సిలర్లు పూజారి వసంత, సువర్ణ, మంజూల, సూర్యకళ, శంకుంతల, డప్పు కిరణ్, రవీందర్యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు అన్వర్, మంగమ్మ, సీనియర్ నేతలు జిమ్మిదేవేందర్, బూరుగుబావి హనుమంతరావు, రాకేశ్, సాయిగౌడ్, వేణుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.