కాచిగూడ, జనవరి 7: మానవ సేవయే మాధవ సేవగా పేదలకు ఉచిత వైద్య సేవలందించడం అభినందనీయమని అంబేద్కర్ కళాశాల చైర్మన్ సరోజావివేక్ అన్నారు. హిందూ శ్మశానవాటిక ప్రభందక కమిటీ చైర్మన్ ఎస్. గోపాల్రావు ఆధ్వర్యంలో పేదల కోసం హ ర్రాస్పెంటలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం, ఉచిత కుట్టుశిక్షణను ప్రారంభించి రెండేండ్లు పూర్తైన సందర్భంగా ఆదివారం మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సరోజావివేక్ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత్రి రాధికాకృష్ణ, డాక్టర్ రమాదేవి, ప్రతినిధులు రాజ్కుమార్విగ్, రాజేందర్పటేల్, వీరస్వామి, విజయ్కుమార్, సాయిగిరిధర్, బి.కృష్ణాగౌడ్, సత్యనారాయణ, నర్సింగ్రావు, నందకిశోర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.