సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : సంకా్రంతి పండుగ నేపథ్యంలో తల్లిదండ్రులు పతంగులు ఎగురవేసే పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. 14, 15వ తేదీలో నగరంలో సంకాంత్రి వేడుకలు జరుగనుండడంతో ప్రార్థనాలయాల పరిసరాలలో పతంగులు ఎగురవేయవద్దని సీపీ నిషేధాజ్ఞలు విధించారు.
అలాగే పోలీసుల అనుమతి లేకుండా స్పీకర్లు, డీజేలు ఏర్పాటు చేసుకోవద్దని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్లు ఉపయోగించవద్దని, దీనిపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని అన్నారు. ప్రశాంతతకు భంగం కలిగించకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.