గౌతంనగర్, జనవరి 25 : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక చొరవతో మౌలాలి, ప్రశాంత్నగర్లో కొన్నేండ్లుగా ఉన్న డ్రైనేజీ అవుట్లెట్ సమస్య ఎట్టకేలకు బుధవారం పరిష్కారం అయింది. డ్రైనేజీ అవుట్లెట్ కోసం కేటాయించిన స్థలం విషయమై మున్సిపల్కు, స్థల యజమానికి మధ్య కోర్టులో కేసు నడుస్తుంది. దీంతో డ్రైనేజీ అవుట్లెట్ పెండింగ్లో ఉం ది. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు పలు మార్లు ఎమ్మెల్యేను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సమక్షంలో మల్కాజిగిరి మండల తాసీల్దార్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ డీసీ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేశ్లు రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. అన్ని పరిశీలించిన అధికారులు ఆ స్థలం భూయజమానికి వర్తిస్తుందని, కోర్టులో కేసు ఉన్నందున కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాలని సూచించారు. అయితే.. కాలనీకి డ్రైనేజీ అవుట్లెట్ లేక ఇబ్బంది అవుతుందని, కోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుందామని అప్పటివరకు డ్రైనేజీ అవుట్లెట్కు స్థలం ఇవ్వాలని కాలనీవాసుల తరపు ఎమ్మెల్యే.. భూ యజమానితో చర్చించారు.
ఎమ్మెల్యేపై ఉన్న గౌరవంతో భూ యజమాని స్వచ్ఛందంగా అందుకు ఒప్పుకున్నారు. దీంతో ఇంజినీరింగ్ విభాగం అధికారు లు డ్రైనేజీని త్వరలో నిర్మించనున్నారు. కాలనీ వాసులు, మున్సిపల్ అధికారులు, భూ యజమాని.. భవిష్యత్లో వచ్చే కోర్టు తీర్పు ప్రకారం అడుచుకుంటామని ఎమ్మెల్యే ముందు ఒప్పుకున్నారు. డ్రైనేజీ అవుట్లెట్ నిర్మించి కాల నీవాసుల ఇబ్బందులు తీరుసుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి హామీఇచ్చారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్కుమార్, డిప్యూటీ కమిషనర్ రాజు, జలమండలి జీఎం సునీల్కుమార్, డీఈ మహేశ్, ఏఈ మధురిమ, బీఆర్ఎస్ నాయకులు పిట్ల శ్రీనివాస్, అమీనొద్దీన్, మౌలాలి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సత్తయ్య, ఆదినారాయణ, చందు, సం తోష్గుప్తా, మబ్బు, గౌలికార్ శైలేందర్, షకీల్, జాన్బీ, మైమూదాబేగం, ప్రశాంత్నగర్ కాలనీ అధ్యక్షుడు అబ్నాన్, విజయలక్ష్మి, ప్రసాద్, రమణ, రవీందర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.