హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. స్థానిక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు పీకేఎల్ హైదరాబాద్ నందే పోటీలు జరుగనున్నాయి. అయితే, లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణను లోకల్ టీమ్ తెలుగు టైటాన్స్ గురువారం మర్యాద పూర్వకంగా ఆయన ఇంట్లో కలుసుకుని, శుక్రవారం జరిగే తొలి మ్యాచ్కు రావాల్సిందిగా బాలకృష్ణను టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఆయన టైటాన్స్ టీమ్కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. తెలుగు టీమ్కు అందరు మద్దతుగా నిలువాలని అభిమానులను కోరారు.