హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పెను ప్రమాదం తప్పింది. బహదూర్పురాలోని ఎన్ఎం గూడలో ఆగి ఉన్న ప్రైవేట్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. మొదట ఓ బస్సులో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి బస్సు మొత్తం వ్యాపించడంతోపాటు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకున్నాయి. దీంతో రెండు బస్సులు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
షార్ట్సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నాయని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్లు ప్రారంభించారు. కాగా, బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.