ఘట్కేసర్, ఫిబ్రవరి 1 : మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఘట్కేసర్ మున్సిపాలిటీలోని శివారెడ్డిగూడ, మారుతీనగర్లో మిషన్ భగీరథ నీటి సరఫరా, ఓపెన్ జిమ్ను చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ప్రజలకు కావాల్సిన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, విద్యుత్ స్థంభాల ఏర్పాటు, వైకుంఠధామాల ఆధునీకరణ, పచ్చదనం, పరిశుభ్రత వంటి సౌకర్యాలకు పెద్దపీట వేసిందని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఓపెన్ జిమ్ల ఏర్పాటు, స్వచ్ఛమైన తాగునీటి కోసం మిషన్ భగీరథను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కమిషనర్ వసంత, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణ ముదిరాజ్, ఏఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.