శేరిలింగంపల్లి, జనవరి 2: మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం రాత్రి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజగూడలో రూ. 20.88 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వీధి దీపాలను ఆయన స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖాజగూడ నుంచి రాయదుర్గం డాబా జంక్షన్ వరకు నూతనంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటుచేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నూతనంగా ప్రారంభించిన వీధిదీపాలతో కాలనీకి కొత్తశోభ వచ్చిందని అన్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఇంద్రదీప్, డీఈ మల్లికార్జున్, ఏఈ రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్, రాజు ముదిరాజ్, జంగయ్య యాదవ్, రమేశ్, అంజమ్మ, పద్మ, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి డివిజన్లో రూ. 5.65 లక్షలతో..
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్బండా ఆనంద పోచమ్మ దేవాలయం నుంచి అపర్ణ సెరెన్ అపార్టుమెంట్స్ వరకు రూ. 5.65 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వీధిదీపాలను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాజుయాదవ్, రవి యాదవ్, పద్మరావు, నాగేశ్ గౌడ్, సురేశ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.