President | హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాతో పాటు పలువురు స్వాగతం పలికారు.
శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు చేరుకున్న ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఐదు రోజుల విడిది అనంతరం 23న తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ ఐదు రోజుల్లో రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.