సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను వేగంగా పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 59 ఆర్జీలకు గాను 2 4గృహ నిర్మాణ శాఖ, 35 ఇతర శాఖలకు చెందిన ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటా చారి, ఆర్డీవోలు సూర్యప్రకాశ్, రవికుమార్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ప్రజావాణి ద్వారా 164 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. చార్మినార్ జోన్లో 8, సికింద్రాబాద్ జోన్లో 13, కూకట్పల్లి జోన్లో 29, శేరిలింగంపల్లి జోన్లో 12, ఖైరతాబాద్ జోన్లో ఒకటి వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అడ్మిన్ సరోజ, యాదగిరిరావు, సీఈ దేవానంద్, టౌన్ప్లానింగ్ అధికారులు, హెచ్ఓడీలు డాక్టర్ పద్మజ, డాక్టర్ రాంబాబు, హౌసింగ్ ఎస్ఈ విద్యాసాగర్, ఓఎస్డీ అనురాధ, ఏఎంసీ శారద తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా