ఆర్కేపురం, డిసెంబర్ 13 : విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రగతి డిగ్రీ కళాశాల చైర్మన్ రాజేశ్వర్రెడ్డి సూచించారు. మంగళవారం దిల్సుఖ్నగర్ ప్రగతి డిగ్రీ మహిళా కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను కొత్తపేటలోని బాబూ జగ్జీవన్రామ్ భవన్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. విద్యార్థి దశలోనే ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యసాధనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థినులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సితారాంరెడ్డి, డైరెక్టర్లు డాక్టర్ పి.రామిరెడ్డి, టి.చిన్నారెడ్డి, ప్రిన్సిపాల్, డైరెక్టర్ మంజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.