ఖైరతాబాద్, మార్చి 11 : వాహన కాలుష్య నివారణకు పరిష్కారంగా రిటైర్డ్ నేవీ అధికారి మార్గాన రామారావు రూపొందించిన పొల్యూషన్ కంట్రోల్ డివైజ్ను బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆవిష్కరించారు. ఈ మేరకు రా మారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో కాలుష్యానికి ప్రధాన కారణాలు వాహనాలని, నిత్యం అందులోని నుంచి వచ్చే ప్రమాదకరమైన పొగ అనేక అనారోగ్యాలకు దారి తీస్తుందన్నారు. బీఎస్-6 వాహనాలు సైతం పూర్తి స్థాయిలో సురక్షితం కాదని, తాను రూపొందించిన ఈ యం త్రాన్ని బస్సు, డీసీఎం, ఆటోలలో అమర్చుకుంటే 80 శాతం మేర కాలుష్యం తగ్గి పోతుందన్నారు.
2001 నుంచి ఈ యంత్రంపై అనేక పరిశోధనలు జరిపానని, ప్రస్తుతం పేటెంట్ హక్కులు సైతం సాధించినట్లు చెప్పారు. బస్సులు, లారీలు, ఆటోలకు వీటిని అమర్చినట్లయితే కాలుష్యకారకాలను వాతావరణంలో కలువన్వికుండా అడ్డుకుంటుందని, తద్వారా కాలుష్య నివారణ జరుగుతుందన్నారు. ఆర్టీసీ ముందుకు వస్తే తయారు చేసి ఇస్తానని తెలిపారు.